ఒకే మండపంలో ఇద్దరు అమ్మాయిలతో లవ్‌ మ్యారేజ్‌

ఒకే మండపంలో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో.. ఒక యువకుడు ఒకే మండపంలో ఇద్దరు యువతులను పెళ్లి

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 25, 2025 | 05:32 PMLast Updated on: Apr 25, 2025 | 5:32 PM

Love Marriage With Two Girls In The Same Hall

ఒకే మండపంలో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నాడు ఓ యువకుడు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో.. ఒక యువకుడు ఒకే మండపంలో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న ఘటన జరిగి నెలరోజులు గడవక ముందే అలాంటిదే మరో ఘటన జరిగింది. జైనూరు మండలం అడ్డెసర గ్రామానికి చెందిన రంభబాయి-బాద్రుషావ్ దంపతుల రెండో కుమారుడు ఆత్రం చత్రుషావ్. అదే గ్రామానికి చెందిన యువతితో నాలుగేళ్లుగా చత్రుషావ్‌ ప్రేమలో ఉన్నాడు.

కెరమెరి మండలం సాంగి గ్రామానికి చెందిన బంధువైన మరో యువతిని సైతం ఏడాదిగా ప్రేమిస్తున్నాడు. 15 రోజుల క్రితం ఆమెతో పెళ్లి చూపులు జరిగాయి. ఈ విషయం మొదటి యువతికి తెలియడంతో ఆమె రాయి సెంటర్‌ను ఆశ్రయించారు. ఇద్దరు అమ్మాయిలూ చత్రుషావ్‌ని పెళ్లి చేసుకుంటామని రాయి సెంటర్ పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఒప్పుకోవడంతో.. పెళ్లి పత్రికలు ముద్రించి ఒకే మండపంలో వాళ్లకు పెళ్లి చేయించారు.