Top story:స్మిత సబర్వాల్ కోరి వివాదాలు తెచ్చుకుంటున్నారా?

నా చుట్టూ ఏం జరిగినా.... నేను సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలి. ఈ దురద చాలామందికి ఉంటుంది. వివాదాలు ద్వారా పాపులారిటీ సంపాదించాలి అనే యావ చాలా ఎక్కువ ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 19, 2025 | 04:20 PMLast Updated on: Apr 19, 2025 | 4:20 PM

Is Smita Sabharwal Creating Controversy

నా చుట్టూ ఏం జరిగినా…. నేను సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలి. ఈ దురద చాలామందికి ఉంటుంది. వివాదాలు ద్వారా పాపులారిటీ సంపాదించాలి అనే యావ చాలా ఎక్కువ ఉంటుంది. ఇదేం పద్ధతి అని నిలదీస్తే…. నా వాయిస్ వినిపించ వద్దా ? నాకు మనోభావాలు లేవా? నా ఫీలింగ్స్ నా ఇష్టం అని అంటారు. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. కెసిఆర్ హయాంలో చక్రం తిప్పిన ఈ లేడీ ఆఫీసర్…. ఆ తర్వాత లూప్ లైన్ లో పడిన కూడా ఎక్కడ తగ్గడం లేదు. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే ఊపులో ఉన్న స్మిత కి ఇటీవల తిరిగి రేవంత్ సర్కార్ ఫోకల్ పోస్టు కేటాయించింది. ఇచ్చిన పనిపై కంటే ఎక్స్ట్రా కర్రిక్యులర్ యాక్టివిటీస్ తో… స్మిత.. కోరి వివాదాలు తెచ్చుకుంటున్నారూ. కొన్నిసార్లు వివాదాలే ఆమెను చుట్టుముడుతున్నాయి. తెలంగాణ సీనియర్‌ ఐఏఎస్‌ లో అందరికంటే ఎక్కువగా స్మిత సోషల్‌ మీడియాను వాడుతుంటారు.

అంతేకాదు తనని తాను చాలా పెద్ద ఇంటలెక్చువల్, ఎంపవార్డ్ ఉమెన్ గా ఎక్కడ వీలైతే అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవల ఆమె ఓ ఎక్స్‌ మెసేజ్‌కు రియాక్ట్‌ అవడం పోలీసు నోటీసులదాకా వెళ్ళింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆమె పెట్టిన ఎక్స్ మెసేజ్‌కు సంబంధించి… గచ్చిబౌలి పోలీసులు ఈ టూరిజం సెక్రెటరీకి నోటీసులు జారీ చేశారు. ఫేక్‌, ఏఐ జనరేటెడ్ ఫోటోలను సోషల్ మీడియాలో రీపోస్ట్ చేశారన్నది స్మితా సబర్వాల్ పై నమోదైన అభియోగం. ప్రస్తుతం హైదరాబాద్‌లో మిస్‌ వాల్డ్‌ పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో కీలకంగా ఉన్నారు స్మిత. అది ప్రతిష్టాత్మ ఈవెంట్‌ కావడం, పైగా టూరిజం సెక్రెటరీగా ఉండి బయట ఫోకస్డ్‌ పొజిషన్‌ కావడంతో… ఆమె పోస్ట్‌ను సీరియస్‌గా తీసుకుంది రేవంత్‌ సర్కార్‌. కంచ గ‌చ్చిబౌలి భూముల విష‌యంలో ఫేక్ వీడియోలు, ఫొటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు ఆమె మీద కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ అధికారులు చెప్తున్నారు. గతంలో కూడా ఇలాగే చాలాసార్లు తన ట్వీట్స్‌తో వివాదాస్పదం అయ్యారామె.

ఐఏఎస్‌గా ఎంపిక‌య్యే వారికి ఎలాంటి వైకల్యం ఉండకూడదని, కాళ్లు చేతులు స‌క్రమంగా ఉండాలంటూ… స్మిత చేసిన ట్వీట్‌ జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపింది. సాటి ఐఎఎస్‌లు కూడా ఆమె వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. చివరికి క్షమాపణలు చెప్పుకునేదాకా వెళ్ళింది వ్యవహారం. ఇక ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి స్మితా సభర్వాల్‌ వాహనానికి లక్షల రూపాయలు చెల్లించడాన్ని ఆడిట్ ‌అధికారులు తప్పు పట్టారు. తొమ్మిదేళ్ళలో దాదాపు 61లక్షల రూపాయల్ని స్మితా వాహనానికి చెల్లించడం వివాదాస్పదమైంది. ఆ వ్యవహారం కూడా నోటీసులదాకా వెళ్ళింది. కానీ… ప్రభుత్వ ఉన్నతాధికారిగా పని చేస్తూ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం పైనే ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో అధికారిగా కొనసాగడం ఇష్టం లేకపోతే… ఆమె పోస్టు నుంచి తప్పుకోవాలి కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయినా తనని తాను చాలా తెలివైన, ఇంటలెక్చువల్ పర్సన్ గా సెల్ఫ్ ప్రమోట్ చేసుకునే స్మిత సబర్వాల్ ఒక ఏఐ ఫేక్ ఫోటో ని ఎలా గుర్తించలేకపోయారు? అంత గుడ్డిగా ఫోటోని సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ చేశారు అని ప్రశ్నిస్తున్నారు సీనియర్లు.

చిన్న చిన్న ఉద్యోగులు తెలిసీ తెలియక తప్పులు చేస్తే… సస్పెన్షన్లు, డిస్మిస్ చేసే ఉన్నత అధికారులే ఇలాంటి పనులు చేస్తే ఎలాగన్న ప్రశ్నలు వస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇలా నిబంధనలకు విరుద్ధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సోషల్‌ మీడియాలో మెసేజ్‌లు పెట్టడం సరైన పద్ధతి కాదంటున్నాయి సచివాలయ వర్గాలు. కెసిఆర్ ప్రభుత్వంలో అంతా తానై నడిపించిన స్మితా.. ప్రస్తుతం ఉనికి చాటు కునేందుకే ఇలాంటి మెసేజ్‌లు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు అధికార పార్టీ నేతలు. అయినా… వివాదాలు స్మితకు కొత్త కాదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవని నెత్తినేసుకు తిరగడం ఆమెకు అలవాటే.

సీనియర్‌ ఐఎఎస్‌లు సాధారణంగా…. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తమదైన శైలిలో తీసుకువెళ్ళడం, అభివృద్ధిలో తమ ముద్ర కనిపించేలా సంస్కరణలు తీసుకురావడం వంటివి చేస్తుంటారు. కానీ…. అందుకు భిన్నంగా స్మిత అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం, సాఫీగా సాగుతున్న పనిలో కల్పించుకుని వివాదాస్పదం చేయడం అలవాటైపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో… కంచ గచ్చిబౌలి భూములపై స్మిత పెట్టిన మెసేజ్‌కు రియాక్షన్‌గా పోలీసులు నోటీసుతోనే సరిపెడతారా? లేక అంతకు మించి ముందుకు వెళతారా అన్నది చూడాలి. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్మిత సబర్వాల్…. ఎక్స్ట్రార్డినరీ ఆఫీసర్ల వ్యవహరించారు. అంతేకాదు ఆమె ఐఏఎస్ అధికారిగా కంటే బి ఆర్ ఎస్ సీనియర్ నేతలాగే వ్యవహారాలు నడిపారు . ప్రతిరోజు ఏదో ఒక వ్యవహారంలో దూరి, తన ఉనికిని చాటుకోవడం కోసం స్మితా సబర్వాల్ చేస్తున్న పనులు చూసి సీనియర్లు నవ్వుకుంటున్నారు.