చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి ఏం జరిగిందంటే…
విశాఖ జిల్లా జ్ఞానపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి కలకలం రేపింది. గాలి సోకిందని పూజలు చేయించడానికి చర్చికి తీసుకొచ్చారు

విశాఖ జిల్లా జ్ఞానపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి కలకలం రేపింది. గాలి సోకిందని పూజలు చేయించడానికి చర్చికి తీసుకొచ్చారు బాలిక తల్లి, అమ్మమ్మ. చర్చిలో ఏం జరిగిందో తెలియదు కానీ.. చర్చిలోని జీసస్ బలిపీఠం వద్ద బాలిక శవమై కనిపించింది.
బాలిక ముఖాన్ని చున్నీతో చుట్టి, నోట్లో గుడ్డలు కుక్కినట్లు ఆనవాళ్ళు ఉన్నాయి. దీంతో పోలీసుల బాలిక తల్లి, అమ్మమ్మను అరెస్ట్ చేశారు. నిందితులు విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన వారిగా గుర్తించారు.