Asia Cup: వర్షం పడదు.. మ్యాచ్ ఉంటుంది
ఆసియా కప్ పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ కి వరుణుడి అడ్డంకి తొలగినట్లు తెలుస్తోంది.

It seems that rain will not hinder the Asia Cup Pakistan vs India match
భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు వరుణుడి ముప్పు తొలగినట్లే కనిపిస్తోంది. 2019 వరల్డ్ కప్ తర్వాత ఈ రెండు జట్లు వన్డేలో తలపడుతున్నాయి. పల్లెకెలె స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్కు వరుణుడి ముప్పు ఉందని తెలిసిన ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడ్డారు. అయితే తాజా అంచనాల ప్రకారం ఈ మ్యాచ్కు వరుణుడి అడ్డంకి తొలగినట్లే కనిపిస్తోంది. ఆకాశం మాత్రం మేఘావృతమై ఉంటుందట. మ్యాచ్ రోజున సాయంత్రానికి పల్లెకెలెలో వర్షం పడే అవకాశం 90 శాతం వరకు ఉందని తెలిసిన ఫ్యాన్స్ చాలా ఆందోళన చెందారు.
ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లు కేవలం గంటల వ్యవధిలోనే అయిపోయాయంటేనే.. ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎంతగా ఎదురు చూశారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మ్యాచ్ వర్షార్పణం అవుతుందేమో? అని అభిమానులు భయపడ్డారు. ఈ రెండు టీమ్స్ చివరగా గతేడాది టీ20 వరల్డ్ కప్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత జట్టు ఓటమి అంచున నిలిచింది. అలాంటి సమయంలో విరాట్ కోహ్లీ 82 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ తర్వాత మళ్లీ భారత్, పాక్ తలపడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్పై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ఇలాంటి సమయంలో వర్షం వార్తలు టెన్షన్ పెట్టాయి. తాజాగా పల్లెకెలె వాతావరణం గురించి అందుతున్న సమాచారం ప్రకారం, ఇక్కడ కేవలం చిరుజల్లులు మాత్రమే పడుతున్నాయట. ఇవి కూడా మ్యాచ్ మొదలయ్యే సమయానికి తగ్గిపోతాయట. ఈ రోజు భారీ వర్షం పడే అవకాశమే లేదని వెదర్ రిపోర్టులు చెప్తున్నాయి. అయితే ఎండ పొడ మాత్రం చూపదని తెలుస్తోంది.